Friday, April 26, 2024

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడి హుండీకి రికార్డుస్థాయిలో భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా జూలై నెలలో 139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. దీంతో వరుసగా ఐదో నెల కూడా రూ.100 కోట్లు దాటడం విశేషం. ఈ ఏడాది మార్చి నెలలో రూ. 128 కోట్లు, ఏప్రిల్ లో రూ. 127.5 కోట్లు, మే నెలలో రూ. 130.5 కోట్లు, జూన్ లో రూ. 123.76 కోట్ల ఆదాయం వచ్చింది. చివరి నాలుగు మాసాల్లో 649.21 కోట్ల రూపాయలు స్వామి వారికి కానుకలు అందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement