మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్దమయ్యాడు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ చరణ్ తో ఓ మూవీ తెరక్కెక్కించనున్నాడనే విషయం తెలిసిందే. కాగా రేపే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా వస్తుండగా.. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు జరుగునున్నాయి. ఈమేరకు చిత్రబృందం పోస్టర్ ద్వారా తెలిపారు. పూజ కార్యక్రమం నేపథ్యంలో కియారా నేడు హైదరాబాద్ చేరుకుంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మెగా కుటుంబం కూడా #RC15 లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కూడా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అలాగే సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లుక్ కోసం చరణ్ మరియు హీరోయిన్ కియారా పై ఈరోజు టెస్ట్ షూట్ జరగనున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ మూవీ లాంచింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందాల బొమ్మ కియారా అద్వాని ఇప్పటికె హైదరాబాద్ వచ్చేసింది.
ఇది కూడా చదవండి: మటన్ కన్న బెండకాయలకే రేటు ఎక్కువ..