Monday, May 6, 2024

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు: ఉపరాష్ట్రపతి

కరోనా టీకాపై అపోహలు అవసరం లేదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే మన దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చి దాదాపు 8 నెలలు అవుతున్నా కొంత మంది టీకా తీసుకోవడానికి ఇంకా సంకోచిస్తున్నారు. అయితే టీకాపై ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… టీకా కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందన్నారు. టీకా అనంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు.


దేశంలో తలెత్తిన అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలని.. ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సమష్టికృషితో కరోనా మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం అని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement