Saturday, April 27, 2024

10,000 ఆదిపురుష్ టిక్కెట్లు ఫ్రీగా పంచ‌నున్న‌ రణబీర్ కపూర్..

దేశ వ్యాప్తంగా ఆదిపురుష క్రేజ్ కొత్త పుంతలు తొక్కుతోంది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా 16 జూన్ న థియేట‌ర్లో గ్రాంగ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ వ్యాపించాయి. ఈ సంద‌ర్బంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆదిపురుష్ మూవీ టిక్కెట్లను పేద పిల్లలకు స్పాన్సర్ చేస్తానని పంచుకున్నాడు రణబీర్ కపూర్. హిందీ బెల్ట్‌లలోని NGOలకు 10,000 టిక్కెట్లు పంపిణీ చేయనున్న‌ట్టు వెల్ల‌డించాడు. రామాయణం తనపై చాలా ప్రభావం చూపుతుందని, వ్యక్తిగా ఎదగడానికి దోహదపడిందని రణబీర్ కపూర్ చాలాసార్లు పేర్కొన్నాడు.

రణబీర్ కపూర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. గతంలో కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని వృద్ధాశ్రమాలు, నిరుపేదలు మొదలైన వారికి 10000 టిక్కెట్లను స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement