Thursday, March 28, 2024

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మృతి..

శంకరపల్లి, ప్రభ న్యూస్ : శంకరపల్లి ఓడిఎఫ్ (డిఫెన్స్ ఫ్యాక్టరీ) మార్గంలో కారు ఢీకొట్టడంతో రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి (67) హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మరియు సేవరేజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు.

ఉద్యోగ విరమణ తదనంతరం భార్యా పిల్లలతో కలిసి శంకర్ పల్లి లో నివాసం ఉంటున్నాడు, గురువారం లూన వాహనంపై స్వగ్రామమైన ఎద్దు మైలారంలోని పొలానికి వెళ్ళాడు. పనులు ముగించుకొని తిరిగి శంకర్పల్లికి వస్తుండగా, షుగర్ ఫ్యాక్టరీ మలుపు వద్ద రామచంద్రారెడ్డిని కారు అతివేగంగా ఢీకొన్నది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement