Saturday, April 27, 2024

కామారెడ్డిలో రాహుల్ భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర తెలంగాణ‌లో విజ‌య‌వంతంగా సాగుతోంది. నిన్న‌టిదాకా మెద‌క్ జిల్లాలో సాగిన పాద‌యాత్ర నేడు కామారెడ్డికి చేరుకుంది. సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది. నేటితో తెలంగాణ‌లో రాహుల్ పాద‌యాత్ర ముగినుంది. సాయంత్రం వ‌ర‌కు జిల్లాలో పాద‌యాత్ర కొన‌సాగుతుంది.. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. అనంతరం మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో జరిగే చివరి సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు భారీ జనసమీకరణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement