Wednesday, March 27, 2024

Covid Update : దేశంలో త‌గ్గిన క‌రోనా.. కొత్త‌గా 937 మందికి పాజిటివ్

దేశంలో క‌రోనా వైర‌స్ భారీగా త‌గ్గింది. నిన్న‌టిదాకా వెయ్యికి పైగా న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య నేడు వెయ్యిలోపే న‌మోద‌య్యాయి. దేశ వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో 937 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,61,516కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,515 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,16,492 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,509కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement