Saturday, April 27, 2024

ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రధాని మోదీ అల్పాహార విందు

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాలు తెచ్చిపెట్టిన అథ్లెట్ల‌తో పాటు పలువురు భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ సోమవారం నాడు తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధుతో క‌లిసి ప్ర‌ధాని మోదీ ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో గేమ్స్ వెళ్లే ముందు అథ్లెట్ల‌తో ముచ్చ‌టించిన స‌మ‌యంలో.. ప‌త‌కంతో తిరిగి వ‌చ్చాక ఐస్‌క్రీమ్ తిందామ‌ని సింధుతో మోదీ చెప్పిన విష‌యం తెలిసిందే. దాని ప్ర‌కారం ప్రధాని మోదీ త‌న మాట నిల‌బెట్టుకున్నారు.

కాగా ఈరోజు జరిగిన సన్మాన కార్య‌క్ర‌మంలో జావెలిన్ త్రో గోల్డ్ మెడ‌లిస్ట్ నీర‌జ్ చోప్రాతోనూ మోదీ ఫోటో దిగారు. వారిద్ద‌రూ ప‌ర్స‌న‌ల్‌గా కాసేపు గ‌డిపారు. తన‌కు చూర్మ వంట‌కం ఇష్ట‌మ‌ని నీర‌జ్ చెప్పారు. ఆ డిష్‌ను ఈ కార్య‌క్ర‌మం కోసం మోదీ చేయించారు. హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్ పీవీ సింధుతోనూ మోదీ కాసేపు ముచ్చ‌టించారు. టోక్యో బ్యాడ్మింట‌న్‌లో సింధు బ్రాంజ్ మెడల్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సింధూ రియో ప‌త‌కాన్ని కూడా తీసుకువ‌చ్చింది. రెండు మెడ‌ల్స్ మెడ‌లో వేసుకుని ప్ర‌ధాని మోదీతో సింధు ఫోటో దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త్‌కు మొత్తం ఏడు మెడ‌ల్స్ వ‌చ్చాయి. మెన్స్ హాకీ టీమ్‌తో పాటు నీర‌జ్ చోప్రా, సింధు, ర‌వికుమార్ ద‌హియా, భ‌జ‌రంగ్ పూనియా, మీరాబాయి ఛాను, ల‌వ్లీనా బోర్గోహైన్ ప‌త‌కాలు గెలిచారు.

ఈ వార్త కూడా చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు శుభవార్త

Advertisement

తాజా వార్తలు

Advertisement