Saturday, April 27, 2024

మావోయిస్టు పేరుతో వ్యాపారికి బెదిరింపులు

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో బంగారం వ్యాపారిని మావోయిస్టు కమాండర్ పేరుతో బెదిరించి రూ. 5 కోట్లు డిమాండు చేసిన ఆర్మీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి ఒక దేశీయ పిస్టల్, 4 రౌండ్స్, మూడు మొబైల్ ఫోన్లు, మూడు ఖాళీ గుల్లలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి వెల్లండించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. ఈ మీడియా సమావేశంలో పార్వతీపురం ఓఎస్ది శ్రీ ఎన్.సూర్యచంద్ర రావు, పార్వతీపురం డిఎస్పీ శ్రీ ఎ.సుభాష్, ఎ ఆర్ డిఎస్పీ శ్రీ ఎల్. శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement