Friday, April 26, 2024

చిన్నారి ప్రాణం తీసిన న్యూడిల్స్

రెండేళ్ల చిన్నారి ప్రానం తీశాయి నూడిల్స్..ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు తిరుచ్చి జిల్లా సమయపురంలో చోటు చేసుకుంది. శేఖర్- మహాలక్ష్మీ దంపతులకు సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి కొంత కాలంగా వివిధ అలర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకు తగ్గ చికిత్స పొందుతున్నాడు. తల్లి మహాలక్ష్మి న్యూడిల్స్ వండింది. ముగ్గురూ తిన్నాక మిగిలిన నూడిల్స్ ఫ్రిజ్ లో ఉంచింది.మరుసటి రోజు ఉదయం అదే నూడిల్స్ ని తరున్ కి అల్పాహారంగా పెట్టింది. అది తిన్నాక ఇంట్లోనే తరుణ్ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిజానిజాలు తెలియ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement