Saturday, April 27, 2024

వివాదం ఎఫెక్ట్: అపార్టుమెంట్ ఖాళీ చేస్తున్న నిహారిక దంపతులు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ అపార్టుమెంట్‌లో జరిగిన రచ్చలో మెగా అల్లుడు, నిహారిక భర్త చైతన్యపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే అపార్ట్‌ మెంట్‌లో జరిగిన గొడవపై నిహారిక భర్త చైతన్య ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. అపార్టుమెంట్ వాసులు 25 మంది వరకు వచ్చి తమ ఇంటి డోర్ బాదడంతో తానే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే మీడియాలో తనపై తొలుత కేసు నమోదైనట్లు వస్తుందని తెలిపాడు. తాను అపార్ట్‌ మెంట్‌‌ను కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్నానని, ఆ విషయాన్ని తమ ఓనర్‌కు కూడా తెలిపానని చైతన్య వివరించాడు.

అయితే ఈ విషయంపై అపార్టుమెంట్‌ వాసులకు క్లారిటీ లేకపోవడం కారణంగానే గొడవ జరిగిందని చైతన్య చెప్పాడు. ఇరు వర్గాలకు చెందిన వాళ్లం మాట్లాడుకుని చర్చించుకున్నామని తెలిపాడు. మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నామని..ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశాడు. ఇక ఈ నెల 10న అపార్ట్‌ మెంట్‌‌లోని ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చైతన్య ప్రకటించాడు.

ఈ వార్త కూడా చదవండి: గని రాక ఎప్పుడో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement