Wednesday, May 8, 2024

ఏపీలో కొత్తగా 4147 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మొత్తం 96,121మందికి కరోనా పరీక్షలు చేయగా 4,147మందికి పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. అలాగే మరోవైపు కరోనా కారణంగా చికిత్స పొందుతూ మ‌రో 38 మంది మృతి చెందారు. అలాగే 24 గంటల్లో 5,773మంది కరోనా నుంచి కొలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,97,61,984కి చేరింది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 46,126కి చేరింది. ఇక డిశ్చార్జ్ కేసుల సంఖ్య 18,14,035కి చేరింది. మొత్తం కరోనా కారణంగా 12,566 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement