Sunday, April 28, 2024

Delhi | మోదీ-షాలతో ఏపీ కొత్త గవర్నర్ భేటీ.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ కలిసిన గవర్నర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఇవ్వాల (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. నిన్న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గవర్నర్, ఆదివారం మధ్యాహ్నం ప్రధాన మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

సాయంత్రం గం. 6.15 సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. శుక్రవారం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ ఆ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టి రాజ్యాంగ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడకు తిరుగుప్రయాణం కానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement