Sunday, May 12, 2024

నీలం సాహ్నీ రాజీనామా

ఏపీ ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా మాజీ సీఎస్ నీలం సాహ్నీ నియమితురాలైన సంగతి తెలిసిందే. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీలం సాహ్నీ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఈసీగా నియమితురాలైన నేపథ్యంలో సలహాదారు పదవికి ఆమె ఈ రోజు రాజీనామా చేశారు. సాహ్నీ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.

ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. నిమ్మగడ్డ స్థానంలో సాహ్నీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్ఈసీగా నియమితురాలైన నీలం సాహ్నీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన పదవిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement