Sunday, May 5, 2024

3రోజులు ఆర్జిత సేవలు బంద్..

యాదాద్రి భువనగిరి : కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. మార్చి 28 నుంచి ఈ నెల 30 వరకు ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో పలువురు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణగా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు స్వామి లఘు దర్శనం మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement