Friday, April 26, 2024

Flash: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా మహమ్మారి  బారిన పడ్డారు. తాజా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కు కరోనా నిర్ధారణ అయింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. తనకు కరోనా సోకిన విషయాన్ని శరద్ పవార్ స్వయంగా వెల్లడించారు.
అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు.  వైద్యుల సూచన మేరకు చికిత్స పొందుతున్నానని వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శరద్ పవార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement