Tuesday, April 23, 2024

పూర్వజన్మలో గల ఋణానుబంధాలు..!

ఈవిషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే… మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చు కోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతా నంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు.
ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మనమీద గల పగ తీర్చు కోవడానికి మనల్ని హంసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు.
మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు. ఉదాహరణకు ఒక జరిగిన కథ…

కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉండేవాడు. అతను ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజ నాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్‌ చదివిస్తున్నాడు.
ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు.
”పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాది స్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు.”
అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్నచిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూ పించే ఒక కథ ఇది- ఒకసారి ఒక మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధికుక్కలతో పోట్లాడుతున్నా రు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడి గారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని-
”ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థా లను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు” అని స్వామి జవాబు చెప్పారు. ”నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడ తారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉం టుంది” అన్నారు మహర్షి.
ఒకసారి శ్రీ విద్యా ప్రకాశానందగిరిస్వామి వారు బందరుకి వెళ్తూ గురు వైన శ్రీ మలయాళస్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి ”నీ చేతి సంచి ఏది” అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళస్వామి వారు నువ్వు మోయ గలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.
ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవం తోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్‌కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాéల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుం టాము. ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగు ళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరు తుంది తప్ప మాయం కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement