Tuesday, May 21, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్ర‌యాణీకుల‌కు మొక్క‌లు అంద‌జేసిన ఎంపి సంతోష్ కుమార్

శంషాబాద్: తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు కోటి వృక్షార్చన కార్యక్రమంలో నిర్వ‌హించ‌నుంది.. గంట వ్య‌వ‌ధిలో తెలంగాణా అంత‌టా వివిధ ప్రాంతాల‌లో కోటి మొక్క‌ల‌ను నాటేందుకు ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. దీనిలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికులకు మొక్కలు పంపిణీ చేశారు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ పనికర్‌తో కలిసి ప్రయాణికులకు ఔషధ మొక్కలను అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement