Friday, April 26, 2024

మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అతి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మరో రెండు రోజుల్లో అంటే సోమవారం రోజున… మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

మోత్కుపల్లి నర్సింహులతో పాటు… పలువురు దళిత నేతలు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకో నున్నారు. అంతేకాదు మోత్కుపల్లి నర్సింహులుకు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. దళిత బందు ఛైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడు నెలల క్రితం బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement