Wednesday, May 8, 2024

మళ్ళీ భయపెడుతున్న కరోనా….మినిమమ్ 40వేల కేసులు

ఇండియా లో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,070 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  కాగా తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది.  అందులో 3,10,99,771 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం  4,06,822 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశంలో కొత్త‌గా గడిచిన 24 గంటల్లో 491 మంది మృతి చెందారు.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య 4,27,862కి చేరింది.  అలాగే గడిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనా నుంచి 43,910 మంది కోలుకున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement