Thursday, May 16, 2024

రోడ్డుప్ర‌మాదంలో ఎమ్మెల్యే కొడుకు, మేన‌ల్లుడికి గాయాలు

రోడ్డుప్ర‌మాదంలో ఓ ఎమ్మెల్యే కొడుకు, మేన‌ల్లుడికి గాయాలైన ఘ‌ట‌న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం ఎదుర్లంక వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ నుంచి అమలాపురం వైపు వెళుతున్న కారు బలంగా విద్యుత్తు స్థంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్నది ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్ గా గుర్తించారు. ఎమ్మెల్యే మేనల్లుడు లోకేష్ కు కూడా గాయాలయ్యాయి. అయితే లోకేష్ కు తీవ్రగాయాలయినట్లు తెలిసింది. వీరిద్దరినీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement