Monday, April 29, 2024

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు – సాంగ్ రిలీజ్

ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల రూపొందించిన చిత్రం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్ తక్కువ. సరదాగా … సందడిగా సాగే కామెడీ సన్నివేశాలు ఎక్కువ. ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ ఓ మై ఆద్య’ అంటూ ఈ పాట సాగుతోంది. శర్వానంద్ – రష్మిక పై బీచ్ లో ఈ పాటను చిత్రీకరించారు. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కి డిఫరెంట్ గా అనిపించే పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ బీట్ బాగుంది. ట్యూన్ పరంగా .. చిత్రీకరణ పరంగా చూసుకుంటే, టీనేజ్ లవర్స్ కి సెట్ అయ్యే పాట అనిపించకమానదు. శర్వానంద్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉంటే, రష్మిక వరుస సక్సెస్ లతో ఉంది. అందువలన ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement