Thursday, May 16, 2024

మంత్రి కేటీఆర్ తనయుడికి అంతర్జాతీయ అవార్డు

తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్ అరుదైన ఘనత సాధించాడు. అందులోనూ అతడు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు, వారు ఎదిగి ప్రయోజకులు అవుతున్నప్పుడే అసలైన పుత్రోత్సాహం, పుత్రికోత్సాహం ఉంటుంది. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దంపతులు కూడా పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 2021 ఏడాదికిగానూ ఓ అంతర్జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నాడు. డయానా అంతర్జాతీయ అవార్డుకు కేటీఆర్ తనయుడు హిమాన్షు రావును ఎంపిక చేశారు. బ్రిటన్‌లోని తెస్సి ఒజో సీబీఈ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్ రాకుమారి డయానా పేరిట ఓ ఇవార్డును అందిస్తోంది. సామాజిక సేవలు అందించే 9 నుంచి 25 ఏళ్ల లోపు వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఈ క్రమంలో హిమాన్షు రావు(15)ను ఈ ఏడాది డయానా అవార్డు వరించింది.

ఇది కూడా చదవండి: ఒక్క బైకుపై 130 చలాన్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement