Sunday, April 28, 2024

శ్రీవారి సేవలో టీఆర్ఎస్ ఎంపీ.. తోడుగా వైసీపీ ఎమ్మెల్యే!

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఇరు ప్రాంతాల మంత్రులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న వేళ.. ఆసక్తికరంగా టీఆర్ఎస్ నేతలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారికి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement