Wednesday, May 8, 2024

Mahadev Gaming App – బెట్టింగ్‌ యాప్‌ తో బాలీవుడ్ విల విల – ఈడి విచారణకు నోటీస్ లు

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం బాలీవుడ్‌ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. నేడు విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ ను ఈడీ ( కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు

.ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్ , హాస్యనటుడు కపిల్‌ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. కాగా.. రణ్‌బీర్‌ కపూర్‌ కూడా శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇక, కపిల్‌ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement