Wednesday, May 15, 2024

Kamareddy – సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించిన ప్రభుత్వ విప్

కామారెడ్డి, అక్టోబర్ 6 (ప్రభ న్యూస్):-కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇడ్లీ, చెట్ని అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ, పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం, బడి పిల్లల హాజరును మెరుగుపరచడం, పిల్లల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, డీఈవో ఎస్.రాజు, 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి, 35 వార్డ్ కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజీరావు, ఎంపీపీ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ వురుదొండ నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల రవీందర్, నాయకులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, లద్దూరి లక్ష్మీపతి యాదవ్, నిట్టు లింగారావు, నాగళ్ల రాజేందర్, ద్యావరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement