Saturday, April 27, 2024

మాధురి దీక్షిత్ కి.. మాతృవియోగం

న‌టి మాధురి దీక్షిత్ త‌ల్లి స్నేహ‌ల‌తా దీక్షిత్ క‌న్నుమూశారు. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు అని పేర్కొన్నారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే స్నేహలత మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. గతేడాది తన తల్లి 90వ పుట్టిన రోజు సందర్భంగా మాధురి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు తల్లిని మించిన ఆప్త మిత్రులు లేరని వ్యాఖ్యానించారు. కాగా మాధురి త‌ల్లి మృతికి ప‌లువురు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement