Friday, April 19, 2024

నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

చిత్తూరు : నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ, కారు ఎదురెదురుగా వ‌చ్చి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సింగపూర్ నుండి చెన్నై చేరుకుని అక్కడి నుండి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నట్లు ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ లారీని నడుపుతున్న డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని నగరి సీఐ విచారణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement