Tuesday, May 7, 2024

CP SRINIVAS REDDY: తెలంగాణను వదిలి డ్రగ్స్ ముఠాలు వెళ్లిపోవాలి

హైదరాబాద్, తెలంగాణను వదిలి డ్రగ్స్ ముఠాలు వెళ్లిపోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటల్ లో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారు. సినీరంగంలో డ్రగ్స్‌ వినియోగం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్‌ వినియోగం లేకుండా సినిమా పెద్దలు చూడాలి. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటాం. సినిమా పరిశ్రమలో డ్రగ్స్‌ మూలాలు ఉంటే సహించేది లేదు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారికి హైదరాబాద్‌లో చోటులేదు’’ అని సీపీ హెచ్చరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement