Wednesday, May 15, 2024

WGL: దొంగల దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతి..

ముగ్గురు దొంగల దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ కాశిబుగ్గ శాంతినగర్ కు చెందిన రాకేష్ ఆనే యువకుడిపై ఈనెల 5వ తేదీ రాత్రి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో దాడి జరిగింది.

ముగ్గురు దొంగలు రాకేష్ అనే వ్యక్తి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, డబ్బును దోచుకున్నారు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న రాకేష్ రాత్రి మృతిచెందాడు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement