Wednesday, May 1, 2024

AP: ఫుడ్ పాయిజన్… 20మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కావడంతో 20మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోనసీమ జిల్లాలోని ఓ బీసీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 20మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అమలాపురం రూరల్ మండలం సమనస బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర కడుపునొప్పి, బ్లడ్ మోషన్స్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement