Thursday, May 16, 2024

బంగారు విగ్ర‌హం మీ సొంతం కావాలంటే క‌నిపెట్టండి-కార్తికేయ‌2 మేక‌ర్స్ ఆఫ‌ర్

సినిమా ప్ర‌మోష‌న్స్ తోనే హైప్ ని క్రియేట్ చేస్తున్నారు ప‌లు చిత్రాల మేక‌ర్స్. అదే త‌ర‌హాలో కొత్త‌గా ఆలోచించి త‌మ సినిమా కార్తికేయ‌2ని ప్ర‌మోష‌న్ చేస్తున్నారు మేక‌ర్స్.విభిన్న కథాంశాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న హీరో నిఖిల్ తాజాగా తన సినిమా Karthikeya2పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్, నిఖిల్ సరసన నటిస్తోంది. ఆయా పాత్రల్లో అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు నటిస్తున్నారు. కాగా రాష్ర్టంలోని నాలుగు ముఖ్య నగరాల్లో బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను దాచిపెడుతున్నామని .. వాటిని కనిపెట్టిన వారికి రూ.6 లక్షల విలువగల బంగారు ప్రతిమలను బహూకరిస్తామని ప్రకటించారు కార్తికేయ‌2 చిత్ర మేక‌ర్స్.

ఈ ప్రతిమలను కనిపెట్టేందుకు లోకేషన్స్ లోని కొన్ని ఆనవాళ్లతో కూడిన క్లూ కూడా ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా తాజాగా ఫస్ట్ క్లూ ను రివీల్ చేశారు. ‘కార్తికేయ క్వెస్ట్‌లో లార్డ్ కృష్ణ ప్యూర్ గోల్డ్ ఐడల్ గెలవడానికి మొదటి క్లూను రివీల్ చేస్తున్నాం… విశ్వం ఒక పూసల దందా… నీది నీ భాగ్యం లో ఉందీ అంటే భాగ్యనగరపు నదిబొడ్డులో ఉన్నా జనాల పూసల దండని చేరుకో.. గెట్ సెర్చ్’ అంటూ ఫస్ట్ క్లూను ఇచ్చారు. ఇఫ్పటికే ఈ పోస్ట్ పై నెటిజన్లు, ఆడియెన్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్, క్వెస్ట్ లో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement