Saturday, April 27, 2024

కోవిడ్ గదిలోకి సీఎం జగన్ తన కూతురిని పంపిస్తారా? కేఏ పాల్

ఏపీలో విద్యాశాఖ మంత్రిపై మరోసారి కేఏ పాల్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ తన కూతురిని కరోనా ఉన్న గదిలోకి పంపిస్తారా అని కేఏ పాల్ ప్రశ్నించారు. మరి పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు చెలగాటం ఆడుతోందని ఆయన నిలదీశారు. ఏపీలో ఉన్న బిడ్డలందరినీ జగన్ తన పిల్లలుగా భావించి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై తాను వేసిన పిల్‌పై హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసినందున మే 3 వరకు తాను దీక్షను కొనసాగిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement