Friday, May 10, 2024

ఐపీఎల్ లో ఈసారి కొత్త ఛాంపియన్: రవిశాస్త్రి

ఐపీఎల్ మెగా సమరంలో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నామని అంటున్నాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా ద్వారా స్పందించిన టీమిండియా కోచ్ రవిశాస్త్రి… ‘బ్రిలియంట్ గేమ్… చూస్తుంటే ఈ ఏడాది కొత్త విజేత కోసం మొలకలు వస్తున్నట్టుగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు…ఎవరు గెలుస్తారనే విషయం ప్రస్తావించకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్లలో ఏదో ఒకటి టైటిల్ గెలుస్తుందని రవిశాస్త్రి అంచనా వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైంది.

అయితే ఈ ట్వీట్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌లో దారుణమైన వైఫల్యం తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది చెన్నై సూపర్ కింగ్స్…ఐపీఎల్ 2020 సీజన్‌లో పూర్ పర్ఫామెన్స్ కారణంగా తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్… ఈ సారి టైటిల్ గెలిచి వాటిని స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్నారని ఆశిస్తున్నారు అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement