Wednesday, May 8, 2024

TS: జూనియర్ లైన్ మెన్ ప్రశ్నపత్రం లీక్ ఘటన.. ఐదుగురు అరెస్ట్

తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగులే కీలక సూత్రదారులుగా పోలీసులు తేల్చారు. జులై 17న లైన్ మెన్ పరీక్ష జరిగింది. శివప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ లైన్ మెన్ పరీక్ష రాశాడు. శివప్రసాద్ సెల్ ఫోన్ తో పరీక్షకు హాజరయ్యాడు. శివప్రసాద్ కు ఏడీఈ ఫిరోజ్ ఖాన్ సమాధానాలు చేరవేశాడు. అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ సైదులు, సబ్ ఇంజినీర్ షేక్ షాజాన్ లు మైక్రోఫోన్ సహాయంతో నిందితులు అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.5లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్ గా రూ.లక్ష వసూలు చేసుకున్నారు నిందితులు. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement