Sunday, May 19, 2024

ఉడాన్‌తో భాగస్వామ్యం చేసుకున్న పీట్రాన్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఎలక్ట్రానిక్స్ తయారీదారు పీట్రాన్‌, భారతదేశంలో అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్ ఈ కామర్స్‌ వేదిక ఉడాన్‌తో భాగస్వామ్యం చేసుకుని 2.5 లక్షల యూనిట్లను ఉడాన్‌పై విక్రయించింది. ఈసంద‌ర్భంగా
పీట్రాన్‌ సీఈవో – ఫౌండర్‌ అమీన్‌ ఖ్వాజా మాట్లాడుతూ… సరఫరా చైన్‌ సామర్ధ్యంలతో పాటుగా ఉడాన్‌ మార్కెటింగ్‌ మద్దతు, రియల్‌టైమ్‌ ఎనలిటిక్స్‌ ఇప్పుడు నూతన మార్కెట్‌లకు విస్తరించేందుకు, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పత్తి పరీక్షలను విభిన్న మార్కెట్‌లలో చేసేందుకు అనుమతిస్తుందన్నారు.

రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వ్యాప్తంగా డిజిటల్‌ స్వీకరణ పెరగడం చేత ఉడాన్‌తో మరింతగా వృద్ధి చెందగలమని ఆశిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఉడాన్‌పై రూ.60 కోట్ల వ్యాపారం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఉడాన్‌, హెడ్‌ – ఎలక్ట్రానిక్స్ విభాగం హిరేంద్రకుమార్‌ రాథోడ్‌ మాట్లాడుతూ… ఉడాన్‌పై పీట్రాన్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. మార్కెట్‌లో అత్యున్నత నాణ్యత కలిగిన ఈ బ్రాండ్‌కు అత్యధిక డిమాండ్‌ ఉందన్నారు. అందుబాటు ధరలు వంటివి ఉడాన్‌ను ప్రాధాన్యతా భాగస్వామి బ్రాండ్‌గా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లు ఎంచుకుంటున్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement