Thursday, May 16, 2024

Big story | అభివృద్ధి పథంలో ఐటీ, దేశంలోనే మేటి.. 1500లకుపైగా ఐటీ కంపెనీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ‘సీఎం కేసీఆర్‌ దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుంది. ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో పయణిస్తున్న తెలంగాణ 1500లకుపైగా ఐ.టి, ఐ.టి.ఈ.ఎస్‌ కంపెనీలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సత్వర నిర్ణయాలు, అభివృద్ది ప్రణాళికలతో తెలంగాణ ఏర్పడేనాటికి ఐ.టి ఎగుమతుల విలువ రూ.57, 258 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ. 2,41,275 కోట్లకు చేరి 9,05,715 మందికి ఉధ్యోగాల కల్పనతో పురోగమించింది.

తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లలో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు దక్కగా, గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44 శాతం వృద్ది సాధించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అమెజాన్‌ డేటా సర్వీసు సెంటర్‌ రూ.20,761 కోట్లతో ఫాబ్‌ సిటీ-, ఫార్మా సిటీ, చందన్‌ వెల్లిలలో 3 డేటా సెంటర్లను నెలకొల్పడం గమనార్హం. నేషనల్‌ పే మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ. 500 కోట్లతో స్మార్ట్‌ డాటా సెంటర్‌ ను ఏర్పాటు చేస్తున్నది.

అదేవిధంగా సేల్స్‌ ఫోర్స్‌ రూ.1119 కోట్లతో విస్తరణ చేపట్టింది. గోల్డ్‌ మాన్‌ శాబ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2500 మందికి ఉద్యోగాలు లభించాయి. అమెరికన్‌ ఇన్సూరెన్స్‌ దిగ్గజ కంపెనీ మాసాచూసెట్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ రూ. 1000 కోట్లతో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటును ప్రకటించింది. ఒప్పో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నది. ఇలా అనేక దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా మారింది. కార్పొరేట్‌ రంగంలో ప్రముఖ కంపెనీలు తమ లార్జెస్ట్‌, సెకండ్‌ లార్జెస్ట్‌ క్యాంపస్‌లను హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాయి.

రాజకీయ సుస్థిరత, సమర్ధ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలతో అంతర్జాతీయ పారిశ్రామిక. ఐటీ రంగాలను హైదరాబాద్‌ ఆకర్శిస్తోంది. యాపిల్‌, అమెజాన్‌, సేల్స్‌ ఫోర్స్‌, ఉబర్‌, మైక్రాన్‌, స్టేట్‌ స్ట్రీట్ర్‌, డెవలప్మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌ , ఫియట్‌ క్రిస్లర్‌, మాస్‌ మ్యూచువల్‌, ఇంటెల్‌, ప్రొవిడెన్స్‌, గోల్డ్‌ మ్యాన్‌ సాచ్స్‌, జెడ్‌.ఎఫ్‌ , యు బి ఎస్‌ , పెప్సి, లేగటో లాంటి కంపెనీలను ఆకర్షించడం తో పాటు ఫేస్‌ బుక్‌ , క్వాల్కామ్‌, అక్సెంచర్‌, వేల్స్‌ ఫార్గో, క్సిలినిక్స్‌ , మైక్రోసోప్ట్‌, ఇన్ఫోసిస్‌, ఒరాకిల్‌, టీసీఎస్‌ , ఐబీఎం , టెక్‌ మహీంద్ర, కాగ్నిజెంట్‌ , విప్రో తమ కార్యకలాపాలు విస్తరించాయి.

- Advertisement -

ఐ.టి. రంగం అభివృద్దితో అనుబంధ మిగతా రంగాలైన నిర్మాణ రంగం, రవాణా రంగం. వినోద రంగాలపై ప్రభావం పడుతోంది. ఒక పక్క ఐ.టి రంగం లో దూసుకుపోతుండగా టైర్‌-2 నగరాలలో ఐ.టీ టవర్ల నిర్మాణంతో కొత్త కంపెనీలు ఏర్పాటవడంద్వారా స్టానిక యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

టి-హబ్‌ విజయ ప్రస్థానం..

స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం టి హబ్‌ 1, టి హబ్‌ 2లను నెలకొల్పింది. ఈ వేదికలు తెలంగాణ రాష్ట్రాన్రికి, ప్రత్యేకంగా హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా నిలిచాయి. సాంకేతికరంగంలో టీ-హబ్‌లు సృష్టిస్తున్న అద్భుతాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

టీ- హబ్‌ 1…

ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌ టీ- హబ్‌ 1ను 2015 నవంబర్‌ 5న గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌లో ప్రారంభించారు. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ గానే కాదు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌గా నిలిచింది. టీ-హబ్‌ ద్వారా రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి సాధిస్తున్నది. అతి స్వల్ప సమయంలోనే టీ-హబ్‌ దేశ విదేశాలలో ప్రముఖుల ప్రశంసలు పొందింది.

టీ- హబ్‌ 2…

రూ.400 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్‌ 2 ను ప్రపంచలోనే అతిపెద్దదైన స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా భారీస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందుకోసం రూ.276 కోట్లను ఖర్చు చేశారు. ఆవిష్కరణ (ఇన్నోవేషన్‌), మౌలిక సదుపాయాలు (ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌), సమ్మిళిత వృద్ధి (ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌) అనే త్రీ ఐ సాత్రాలు అమలు చేయడమే లక్ష్యంగా టీ హబ్‌-2ను రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది.

తెలంగాణ ప్రభుత్వ ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో టీ- ఫైబర్‌ ప్రాజెక్ట్‌ (ఫైబర్‌ గ్రిడ్‌ పథకం) ను ప్రవేశ పెట్టింది. దేశంలోనే ప్రప్రధమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకంగా వికసిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న ఆన్‌లైన్‌ సేవలను ప్రజలు సులువుగా పొందవచ్చు. టెలికాం ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టీ-ఫైబర్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. గ్రామ పంచాయతీలు, గ్రామీణ గృహాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలకు నెట్వర్క్‌ను అనుసంధానించడం ద్వారా సేవలు అందిస్తున్నది.

ఫేజ్‌ -2లో భాగంగా 33 జిల్లాలు, 12769 గ్రామపంచాయతీలు, 142 పట్టణ స్థానిక సంస్థలు 30,000 ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్‌ సదుపాయాలను కల్పిస్తున్నది. మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్‌ కల్పించే దిశగా చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు డిజైన్‌ చేయబడిన టీ-ఫైబర్‌కు ఐసిటి ట్రాన్స్ఫర్మేషన్‌ అండ్‌ డిజిటల్‌ ఇండియా విభాగంలో నాలెడ్జ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (కేసీసీఐ) బిజినెస్‌ ఎక్సలెన్స్‌ -2022 అవార్డు లభించింది.

టీ- వర్క్స్‌…

టీ- వర్క్స్‌ ఎలక్ట్రాన్రిక్‌, హార్డ్‌ వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు-చేసిన అతిపెద్ద ప్రో టైపింగ్‌ సెంటర్‌, ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి. అనే నినాదంతో వర్క్స్‌ రూపొందింది. పైసా ఖర్చు లేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చు.

ఎలక్ట్రాన్రిక్స్‌ , ఈ.వి రంగాల విస్తరణకు అవసరమయ్యే ఏకొ సిస్టమ్‌ను అభివృద్ది చేస్తున్నాయి. ఫాక్స్‌ కాన్‌ మాన్‌ ఫ్యాక్చర్‌ యూనిట్‌ను ఏర్పాటు- చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం న్యూ ఎలక్ట్రాన్రిక్‌ హబ్‌ గా అవతరిస్తున్నది. ఆర్టిఫిసియల్‌ ఇంటలిజెన్స్‌ , బ్లాక్‌ చైన్‌ , క్లౌడ్‌ , డ్రోన్స్‌, ఐఓటి, రోబోటిక్స్‌ , స్పేస్‌ -టె-క్నోలజీలపై ప్రత్యేక శ్రద్ద చూపెడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement