Thursday, May 16, 2024

అగ్నిపథ్‌కు భారీగా దరఖాస్తులు..

త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారికి ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియ ప్రారంభమైంది. వాయు సేనలో చేరేందుకు దరఖాస్తులు అహ్వానించారు. మూడు రోజల వ్యవధిలో 56,960 దరఖాస్తులు వచ్చాయని వాయసేనవెల్లడించింది. మరో వైపు దేశంలో చాలా ప్రాంతాల్లో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వాయు సేన శుక్రవారం నుంచి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది.

జూల్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు తమ పేరును వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని వాయుసేన కోరింది. అగ్నివీర్‌ తొలి బ్యాచ్‌ను 2022 డిసెంబర్‌ 11 నాటికి ప్రకటిస్తారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం జూన్‌ 14న ప్రకటించింది. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement