Friday, April 26, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్

మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్ అన్నారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజుతో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉన్న నగరాలన్ని నగరీకరణ ప్రభావంతో కాలుష్య ఖార్ఖానాలుగా మారిపోయాయి.

కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుంది. మనం చూస్తుండగానే ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ఇవ్వాల జోగినిపల్లి సంతోష్ కుమార్ తన భుజాలమీద వేసుకున్నారు. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సంతోష్ కుమార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలంతా తమ బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నాను. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సింగర్ శ్రేయాఘోషల్, ప్రముఖ వాయిద్యకారుడు శివమణికి ఛాలెంజ్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement