Sunday, May 12, 2024

హైద‌రాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ – ఉప్ప‌ల్ స్టేడియంలో టీ20 సిరీస్ లో మూడో మ్యాచ్

సెప్టెంబ‌ర్ లో ఆస్ట్రేలియాతో జ‌రిగే టీ20 సిరీస్ లో మూడో మ్యాచ్ ని హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో టీ20, వన్డేల సిరీస్‌ల షెడ్యూల్‌, వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది.సెప్టెంబర్‌ 25వ తేదీన ఉప్పల్‌ స్టేడియంలో ఆసీస్‌, భారత్‌ మధ్య టీ20 మ్యాచ్‌ జరగనుంది. చివరగా 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు మొహాలీ (సెప్టెంబర్‌ 20), నాగ్‌పూర్‌ (సెప్టెంబర్‌ 23) ఆతిథ్యమిస్తాయి. అనంతరం దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో భారత్‌ పోటీ పడుతుంది. సెప్టెంబర్‌ 28, అక్టోబర్‌ 1, 3వ తేదీల్లో జరిగే మూడు టీ20లను తిరువనంతపురం, గువాహటి, ఇండోర్‌ లలో షెడ్యూల్‌ చేశారు. అక్టోబర్‌ 6, 9, 11వ తేదీల్లో వరుసగా రాంచీ, లక్నో, ఢిల్లీలలో మూడు వన్డేలు జరుగ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement