Friday, May 10, 2024

HYD: మాజీ సీఐ నాగేశ్వరరావును రిమాండ్ కు తరలింపు

మహిళను బెదిరించి అత్యాచారం చేసిన కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది. ఐదు రోజులపాటు నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు విచారించారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, ఆక్సిడెంట్ కేసులపై ఏసీపీ పురుషోత్తం రెడ్డి విచారించారు. బాధితురాలు ఇంటి దగ్గర నుండి యాక్సిడెంట్ అయిన ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు నాగేశ్వర్‌రావును హయత్‌నగర్ కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌కు మాజీ సీఐను తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement