Tuesday, May 7, 2024

కీచ‌క ప్రిన్సిపాల్ పై కేసు నమోదు..

రాచకొండ : హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమి మ‌హిళ‌ల‌ జూనియర్ కాలేజ్ చైర్మన్ అండ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ పై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినికి ఫోన్ చెసి మాయమాటలు చెప్పి సినిమాకి తీసుకుని వెళ్లిన‌ సత్యనారాయణ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ నెల 16న కూడా నీకు ప్రత్యేక క్లాస్ చెపుతాను కాలేజ్ కి రమ్మని సత్యనారాయణ విద్యార్థినికి ఫోన్ చేశాడు. ఈ విష‌యం విద్యార్థిని త‌న కుటుంబ సభ్యులకి తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు హ‌య‌త్ న‌గ‌ర్‌ పోలీసులు నిన్న రాత్రి సత్యనారాయణని అరెస్టు చేశారు. విష‌యం తెలుసుకున్న తోటి విద్యార్ధినిలు ఒక ప్రిన్సిపాల్ ఇలా చేయడం బాధాకరమని భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ ను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ తరలించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement