సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మరో షాక్ ఇచ్చారు. తాజాగా ఓ కేసులో ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ ఎల్జీ సిఫారసు చేయడం సంచలనంగా మారింది.
ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ, ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు పలుకుతున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిధులు స్వీకరించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ విచారణకు సిఫారసు చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం నిర్ణయం తీసుకున్నారు.