Monday, May 13, 2024

‘ఈ నెల 30 తర్వాత ఉచిత రేషన్​ నిలిపివేత’

కొవిడ్​ కాలంలో నవంబర్​ 30 వరకు ప్రజలకు ఉచితంగా రేషన్​ అందించిన కేంద్రం.ఈ నెల 30 తర్వాత ఈ కార్యక్రమాన్ని పొడిగించేందుకు ఎలాంటి ఆదేశం అందలేదని, కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చేయలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్​ పాండే వెల్లడించారు.

గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీబ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా రుష‌న్ కార్డు హోల్డ‌ర్ల‌కు 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. 2020 ఏప్రిల్​లో ఈ కార్యక్రమం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్​ కార‌నంగా ఈ ఏడాది మే, జూన్​ వరకు ఈ కార్యక్రమం పొడిగంచారు . కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్​లో మరో ఐదు నెలలు పొడిగించారు. దేశవ్యాప్తంగా ఎన్​ఎఫ్​ఎస్​ఏ(జాతీయ ఆహార భద్రత చట్టం) కింద గుర్తింపు పొందిన రేషన్​ కార్డుహోల్డర్లకు ఉచిత రేషన్​ను అందిస్తోంది కేంద్రం. 80కోట్ల మంది ఈ కార్యక్రమంతో లబ్ధిపొందినట్టు ప్రభుత్వం గతంలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement