Sunday, May 19, 2024

రొయ్య‌ల ఫ్యాక్ట‌రీ విద్యుత్ లైన్ లో ఆగ‌ని వివాదం

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం పోతుకుర్రులో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్ట‌రీకి వేస్తున్న 33కెవి విద్యుత్ లైన్ లో వివాదం ఆగ‌డం లేదు. క్రాప గ్రామం నుంచి కె‌.జగన్నాధపురం వరకూ వేసిన తొమ్మిది విద్యుత్ లైన్ పోల్స్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ముమ్మిడివరం నుంచి క్రాప, జగన్నాధపురం మీదుగా పోతుకుర్రు రొయ్యల ప్యాక్టరీకి వేస్తున్న 33కెవి విద్యుత్ లైన్ నిర్మాణాన్ని గత కొన్ని నెలలుగా గ్రామ‌స్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ జాన్ కుమార్, ఎఎస్ఐ కృష్ష ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement