Wednesday, May 8, 2024

మళ్లీ అక్కడే అగ్నిప్రమాదం.. నాలుగు రోజుల్లో రెండో సారి

హైద‌రాబాద్ పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ కింద మ‌రోసారి అగ్నిప్రమాదం జరగడం స్థానికగా కలకలం రేపింది. ఫ్లై ఓవ‌ర్ పిల్ల‌ర్‌కు ఏర్పాటు చేసిన ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో వాహ‌న‌దారులు, స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. కాగా మూడు రోజుల క్రితం ఇదే ఫ్లై ఓవ‌ర్ కింద ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లో మంట‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదం షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా జ‌రిగిందా లేదా ఎవ‌రైనా నిప్పు పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement