Wednesday, May 22, 2024

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం.. 2022

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ 2022 సంవత్సరానికి ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి ఇవ్వడానికి పురస్కార కమిటీ నిర్ణయించింది. త్వరలోనే పురస్కార ప్రదాన కార్యక్రమ వివరాలు తెలియజేయడం జరుగుతుంది.‘శ్రీ శ్రీనివాసాచార్య గారు తమ కవిత్వానికీ, అందులోని గాఢమైన, హృద్యమైన పద వైచిత్రికీ, ఆలోచనకి, కావ్యానురక్తికి మంచి పేరు, గుర్తింపు ఇప్పటికే తెచ్చుకున్న కవులు. ఆ ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో ఈ పురస్కారం ఒక చిన్న బహుమానం మాత్రమే!’ అని కమిటీ సభ్యులు తెలియజేశారు.

కమిటీ సభ్యులు
ఇంద్రగంటి జానకీబాల
శీలా సుభద్రాదేవి
మోహనకృష్ణ ఇంద్రగంటి

Advertisement

తాజా వార్తలు

Advertisement