Wednesday, May 8, 2024

నడి రోడ్డుపై కొత్తిమీర నాట్లు

అనంతపురం జిల్లాలో రోడ్లు అధ్వాన పరిస్థితిపై సీపీఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గుంతలుగా ఉన్న రోడ్లపై నుంచి రాకపోకలు అస్థవ్యస్థంగా మారడంతో.. అవే రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఇలాకాలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండటంతో సీపీఐ నాయకులు కొత్తిమీర నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదారి గుండా నిత్యం వందల సంఖ్యలో అనంతపురం నుంచి హిందూపురం పట్టణాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని…కాని గుంతల రోడ్లతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందుుల ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, మంత్రి శంకర్ నారాయణ స్పందించి మరమ్మతులు చేపట్టాలని సీపీఐ నాయకులు కోరారు.

ఇది కూడా చదవండి : మోడీ, కేసీఆర్ తోడు దొంగ‌లు: రేవంత్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement