Tuesday, May 7, 2024

సుకుమార్ కి జ్వరమొచ్చింది….పుష్ప కు బ్రేక్ పడింది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విలన్ గా మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్….ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ వర్షాల కారణంగా బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి బ్రేక్ పడిందిమ్ అందుకు కారణం సుకుమార్ కు జ్వరం వచ్చిందట. హైదరాబాదులో వేసిన సెట్లో చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుండగా…సుకుమార్ కొలుకున్నాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement