Sunday, April 28, 2024

National : ఇంట్లో పేలిన సిండర్.. న‌లుగురు మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో ప్ర‌మాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో త‌ల్లితో స‌హా ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

- Advertisement -

డుమ్రిలో ఓ గృహిని ఛాయ్ పెడుతుండగా.. గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు అంటుకుని గృహిని సహా ఆమె ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, తల్లి సహా ముగ్గురు పిల్లలు చనిపోయారని డోరియా ఎస్పీ సంకల్ప్ శర్మ చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement